Murder: కూతురు స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన వీడియోగ్రాఫర్.. సినిమా రేంజ్లో హత్య చేసిన తండ్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agra Videographer Murder: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ వీడియోగ్రాఫర్ని హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్లో నది ఒడ్డుకు తీసుకువచ్చి, నిప్పంటించారు. మృతదేహాన్ని ఎంతలా కాలిపోయిందంటే.. కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోయారు. కానీ పోలీసులు కష్టపడి 19 నెలల తర్వాత ఈ హత్య మిస్టరీని ఛేదించారు. ఈ హత్య వెనుక గల కారణం, పలు హత్య వివరాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Trump: ఆ పత్రిక అత్యంత చెత్తది.. న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ 15 బిలియన్ల దావా
Also Read
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
ఆగ్రాలోని మల్పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 2024 ఫిబ్రవరి 18 రాత్రి ఈ ఘటన జరిగింది. రాకేష్ అనే వీడియోగ్రాఫర్ని దేవి రామ్ అనే 45 ఏళ్ల వ్యక్తి చంపేశాడు. దేవీ రామ్ కుమార్తెతో రాకేష్కు సంబంధం ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. రాకేష్ ఆమెకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు ఫొటోలు తీశాడనే సమాచారం తెలియగానే.. తట్టుకోలేక పోయాడు తండ్రి. రాకేష్కు సమాధి కట్టాలని ప్లాన్ చేశాడు. దేవి రామ్ రాకేష్ను దుకాణానికి పిలిచి మఫ్లర్, ఇనుప తీగతో వెనుక నుంచి గొంతుకు బిగించి చంపాడు. హత్య అనంతరం తన మేనల్లుడు నిత్య కిషోర్ను పిలిచి, ఇద్దరూ కలిసి రాకేష్ మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్లో వేశారు. రాత్రి చీకటిలో ఆ డ్రమ్ను లోడర్లో వేసుకుని ఖరీ నది సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి మృతుడి మొబైల్, మఫ్లర్, వైర్ను నదిలోకి విసిరి, బైక్ను హైవేపై వదిలివేశారు.
ఫిబ్రవరి 20, 2024న ఆ ప్రాంతంలో పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని కనుగొన్నారు. దానిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే, రాకేష్ అదృశ్యంపై అప్పటికే ఫిర్యాదు అందడంతో వారి కుటుంబీకులను పిలిపించారు. వాళ్లు కూడా మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. కానీ, పోలీసులు పట్టు వదలలేదు. మృతదేహం DNA నమూనాలను తీసుకున్నారు. ఇది రాకేష్ తల్లి DNAతో సరిపోలింది. సాంకేతిక దర్యాప్తు, నిఘా సహాయంతో పోలీసు బృందం ప్రధాన నిందితుడు దేవి రామ్ను సెప్టెంబర్ 15, 2025న అరెస్టు చేసింది. విచారణలో, అతను తన నేరాలను అంగీకరించాడు. అతని మేనల్లుడు నిత్య కిషోర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
-
Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
-
NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
-
Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!
-
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..