Minister Ramprasad Reddy: ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్.. ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా కృషి..
- ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సుల ఏర్పాటు..
- ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం.. ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటి నియోజకవర్గంలో 2000 కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.. భూ ఆక్రమణలపై మండిపడ్డ మంత్రి.. టీడీపీ ఇచ్చిన హామీల మేరకు పేదల, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. సంబేపల్లి మండలంలో వంకపొరం పోడు భూముల ను ఆక్రమించి వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు రెవెన్యూ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేశారన్నారు. అయితే, టీడీపీ కక్ష కట్టి ఎటువంటి చర్యలు తీసుకోదు అని స్పష్టం చేశారు.
Read Also: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్ లేనట్టే..!?
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
జిల్లాలో ఆక్రమణకు గురైన భూములపై కలెక్టర్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మంత్రి రాంప్రసాద్రెడ్డి.. భూ బకాసురుల చేతిలో ఉన్న ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్న ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ప్రజల నుంచి భూములు ఆక్రమించిన వారి వద్ద నుంచి వాటిని స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇవ్వాలన్నారు.. ప్రజలెవరు ఇకనుంచి బాధపడాల్సిన అవసరం లేదు.. ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సులు పెడతాం.. ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!