రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు మంచి.. క్రేజ్ ఉంది. ఏ ఛానల్ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు, ఇతరులు అందరూ ఎన్టీవీ ఛానల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు సినీ స్టార్లు కూడా ఎన్టీవీకి విషెష్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అనిల్ రావిపూడి, రోషన్ (శ్రీకాంత్ సన్), శ్రీలీల (పెళ్లి సందడి కొత్త ఫేమ్), వివి వినాయక్, సుకుమార్, ప్రకాష్ రాజ్, వెంకటేశ్, దేవి శ్రీ ప్రసాద్ ఎన్టీవీకి శుభాకాంక్షలు చెప్పారు.