Aadi Srinivas : గీత కార్మికులకు సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
- గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్
- కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ చేసిన ఆది శ్రీనివాస్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విప్ , స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కొత్త గ్రంథాలయ భవనంలో కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గీత కార్మికులకు కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గీత కార్మికులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. చెట్లపై పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్లు అందించడం జరుగుతోందని చెప్పారు. ఈ కిట్ కార్మికులకు ప్రాథమిక రక్షణను అందిస్తూ, ప్రమాదాల కారణంగా గాయపడకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్ స్టేషన్.. శంకుస్థాపన చేసిన రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి
మరింతగా, గౌడ కులస్తులకు ప్రభుత్వ పక్షాన పెన్షన్లు, ప్రమాదాల సమయంలో పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వానికి అధికారం చేపట్టే సమయంలో ఆర్థికంగా చాలా సంకటంలో ఉన్నట్టు వివరించారు. రాష్ట్రం ప్రతి నెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.6 వేల కోట్లు అప్పుల వడ్డీలకే ఖర్చవుతున్నాయన్నారు.
అయితే, ఆర్థిక ఇబ్బందులకు మధ్య కూడా అభివృద్ధి , సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది గౌడ కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వ ప్రయోగం కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గాల్లో 400 మందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో