Aadi Srinivas : గీత కార్మికులకు సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
- గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్
- కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ చేసిన ఆది శ్రీనివాస్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విప్ , స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కొత్త గ్రంథాలయ భవనంలో కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గీత కార్మికులకు కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గీత కార్మికులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. చెట్లపై పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్లు అందించడం జరుగుతోందని చెప్పారు. ఈ కిట్ కార్మికులకు ప్రాథమిక రక్షణను అందిస్తూ, ప్రమాదాల కారణంగా గాయపడకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్ స్టేషన్.. శంకుస్థాపన చేసిన రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి
మరింతగా, గౌడ కులస్తులకు ప్రభుత్వ పక్షాన పెన్షన్లు, ప్రమాదాల సమయంలో పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వానికి అధికారం చేపట్టే సమయంలో ఆర్థికంగా చాలా సంకటంలో ఉన్నట్టు వివరించారు. రాష్ట్రం ప్రతి నెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.6 వేల కోట్లు అప్పుల వడ్డీలకే ఖర్చవుతున్నాయన్నారు.
అయితే, ఆర్థిక ఇబ్బందులకు మధ్య కూడా అభివృద్ధి , సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది గౌడ కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వ ప్రయోగం కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గాల్లో 400 మందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!