NTV Telugu Site icon

Jishnu Dev Varma :దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలి..

Jishnu Dev Varma

Jishnu Dev Varma

ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి కంటే లంకా బాగుంది అంటే.. మన భూమి మనకు అమ్మ లాంటిది అని రాముడు చెప్పాడని ఆయన గుర్తు చేశారు. మన భూమి.. మన సంస్కృతిని ఎప్పుడు మర్చిపోవద్దని, మనమంతా ఒక్కటే.. మనమంతా సమానమే.. మన సంస్కృతులన్నీ ఒక్కటే అని ఆయన వ్యాఖ్యానించారు. మన సోదరినే కాదు సమాజాన్ని రక్షిస్తాం అని ప్రతిజ్ఞ చేద్దామన్నారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భాషలు.. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని, పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారత్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామన్నారు ఈటల రాజేందర్‌.

  Tragedy: విషాదం.. హంసలదీవి బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు గల్లంతు