Phone Tapping Case: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్.. బీజేపీ సీరియస్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
- 15 రోజుల పాటు ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్
- ఈ అంశంపై బీజేపీ సీరియస్
- కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నారు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకుంటున్నారు.. పీఏను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం! ఉంది. గతంలో ఈ వ్యవహారంపై ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. గవర్నర్గా ఉన్న సమయంలో ఇంద్రసేనరెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్ మ్యాన్లు, రియల్ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు..
READ MORE: MP Gurumurthy: విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ గురుమూర్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ఇదిలా ఉండగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీజేపీ కోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!