Phone Tapping Case: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్.. బీజేపీ సీరియస్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
- 15 రోజుల పాటు ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్
- ఈ అంశంపై బీజేపీ సీరియస్
- కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నారు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకుంటున్నారు.. పీఏను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం! ఉంది. గతంలో ఈ వ్యవహారంపై ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. గవర్నర్గా ఉన్న సమయంలో ఇంద్రసేనరెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్ మ్యాన్లు, రియల్ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు..
READ MORE: MP Gurumurthy: విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ గురుమూర్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ఇదిలా ఉండగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీజేపీ కోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!