New Govt Scheme: యువతకు కేంద్రం గుడ్న్యూస్.. ప్రతి నెల రూ. 5000!
- యువత కోసం కేంద్రం కొత్త పథకం
- ప్రతి నెల రూ. 5000!
- పూర్తి వివరాలు తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇది యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతుంది. అలాగే వారికి ప్రతినెలా రూ.5000 వరకు ఇంటర్న్షిప్ అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ప్రభుత్వ యువత కోసం ఈ పథకం కింద కొత్త పోర్టల్ కూడా అభివృద్ధి చేయబడుతుంది. ఈ పథకం పూర్తి వివరాలను తెలుసుకుందాం…
బడ్జెట్ 2024లో “ఇంటర్న్షిప్ పథకం..
వాస్తవానికి, “ఇంటర్న్షిప్ పథకాన్ని బడ్జెట్ 2024లో ప్రతిపాదించారు. తాజాగా దీనిని ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎన్బీసీ-టీవీ 18 (CNBC-TV 18) నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) త్వరలో కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభించడానికి మార్గదర్శకాలను జారీ చేయబోతోంది. ఈ పథకాన్ని వేరే వారంలో ఎప్పుడైనా ప్రవేశపెట్టవచ్చు. అంతేకాకుండా.. ప్రత్యేక ఇంటర్న్షిప్ పోర్టల్ కూడా ప్రారంభించబడుతుంది.
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
నిబంధనలు, షరతులు ఏమిటి?
పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, యువత కొన్ని ప్రమాణాలను అనుసరించాలి. ఈ ప్రమాణాలు లేకుండా ఈ పథకం ప్రయోజనం పొందడం కష్టం. ఈ పథకం కింద, ఇంటర్న్ వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే అతని కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ప్రస్తుతం.. అధికారిక డిగ్రీ కోర్సు లేదా ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్షిప్ పథకంలో భాగం కాలేరు. ఈ అభ్యర్థులు ఆన్లైన్ కోర్సులు లేదా వృత్తి శిక్షణలో చేరవచ్చు.
పథకం కింద ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
కార్పొరేట్ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ఈ కార్యక్రమం సహాయకరంగా ఉంటుంది. ఇందులోభాగంగా చాలా పెద్ద కంపెనీలు ఆసక్తి చూపాయి. కంపెనీలు యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సిద్ధం చేసి, ఈ పథకం కింద ఉద్యోగాలు అందించడంలో సహాయం చేస్తాయి. ప్రతి ఇంటర్న్కు స్టైఫండ్ ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద యువతకు ప్రతినెలా రూ.5,000 లభిస్తుంది. ఇందుకోసం కంపెనీల సీఎస్ ఆర్ ఫండ్ నుంచి రూ.500, ప్రభుత్వం రూ.4,500 అందజేస్తుంది.
ప్రతి ఇంటర్న్కు ప్రభుత్వం ఒకేసారి రూ.6,000 చెల్లింపు
ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షణకు అయ్యే ఖర్చులను కంపెనీలు భరిస్తాయి. అయితే అక్కడ ఉండేందుకు, తిండికి అయ్యే ఖర్చులను యువత భరించాల్సి ఉంటుంది. కానీ ఆ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చే సాయంతో భర్తీ అవుతాయి. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం కంపెనీలు, యువత మధ్య గొలుసును సృష్టించడం, తద్వారా ప్రజలు సులభంగా ఉద్యోగాలు పొందవచ్చు. కంపెనీలు మంచి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను పొందవచ్చు.
తాజావార్తలు
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!