AP CS Vijayanand: సీఎస్గా విజయానంద్.. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి!
- నూతన సీఎస్గా విజయానంద్
- ప్రస్తుత సీఎస్ డిసెంబర్ 31తో పదవీవిరమణ
- టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విజయానంద్ను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్కు సీఎస్గా అవకాశం ఇవ్వడంతో టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన బీసీ అధికారికి సీఎం చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారని పలువురు టీడీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం దక్కుతుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
బీసీలకు నారా చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని నేతలు, అధికారులు అంటున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారిగా శ్యామల రావు నియామకం జరిగిందంటున్నారు. అటు ప్రభుత్వంలోను, పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు. తెలుగు దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసన సభ స్పీకర్గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం వచ్చిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే వైఎస్ జగన్ నియమించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..