Gorantla Butchaiah Chowdary: మేం అధికారంలోకి రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: వైసీపీ మేనిఫెస్టో ఒక చెత్తలా ఉందని విమర్శించారు టీడీపి పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదనీ, ఇది దగా కోరు ప్రభుత్వమని ఆయన అన్నారు. మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి దానిమీదే వ్యాపారం చేస్తున్న ఘనుడు జగన్ అంటూ మండిపడ్డారు. రేపటి నుంచి టైటాలింగ్ చట్టం అమల్లోకి వస్తుందనీ, ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించకుండా, వారి వద్ద నుంచి పట్టాలు వెనక్కి తీసుకుని వాటిని కూడా తాకట్టు పెట్టి.. జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని విమర్శించారు.
Read Also: Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
ఇక, కూటమి ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకు సీఎం జగన్ అనేక కుతంత్రాలు, కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు బుచ్చయ్య. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు చైతన్యవంతం అయ్యారని, పవన్ కల్యాణ్.. ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో తెలుసునని, వేరే అభ్యర్ధులను పెట్టి పోలిన గుర్తులు కేటాయించడం వల్ల కూటమి అభ్యర్ధులకు ఎలాంటినష్టం లేదన్నారు. టీడీపీ పార్టీ ప్రారంభం లో అందరికీ సైకిల్ గుర్తు ఎన్నికల సంఘం ఇచ్చిందని, అప్పట్లో ఇతరులకు ఈ గుర్తులను కేటాయించలేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ను అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దారుణమన్న ఆయన.. పవన్ తన సొంత నిధులు రైతులకు సాయం చేశారని, అనేక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటే, జగన్ సొంత నిధులేమైనా ఖర్చు చేశాడా? అని గోరంట్ల ప్రశ్నించారు. యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. కాపు ఉద్యమ నేతగా చెప్పుకుంటున్న ముద్రగడ పద్మనాభం.. కాపులకు తీరని అన్యాయం చేశారని, పిఠాపురంలో ముద్రగడ పద్మనాభమే పోటీ చేసివుంటే అసలు సంగతి ఏమిటో తేలేది కదా అని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఈడబ్యూఎస్ లో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తే.. వాటిని రద్దు చేసిన సీఎం జగన్ కు పద్మనాభం మద్దతు ఇస్తూ.. కాపులకు అన్యాయం చేశారని గోరంట్ల బుచ్చియ్యచౌదరి మండిడ్డారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!