Gold Smuggling : రైల్వేస్టేషన్లలో రూ.5.53 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Smuggling : అధికారులు ఎంత నిఘా పెట్టిన బంగారం స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. స్మగ్లింగ్ ఎక్కువగా విమానాల్లో జరుగుతున్న వార్తలను వింటున్నాం. విమాన మార్గాలకే పరిమితమైన బంగారం స్మగ్లింగ్ రైల్వేలకు పాకింది. తాజాగా పట్టుబడిన రెండు బంగారం స్మగ్లింగ్కేసుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని డైరెక్టరేట్ఆఫ్ఇంటెలిజెన్స్రెవెన్యూ వారు పట్టుకున్నారు. సికింద్రాబాద్, శ్రీకాకుళం రైల్వేస్టేషన్లలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.5.50కోట్లు ఉంటుందని ఇంటెలిజెన్స్బృందాలు తెలుపుతున్నాయి.
Read Also: Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో స్మగ్లర్లు తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని సిబ్బంది గమనించి… అతని బ్యాగ్ నుంచి 2.314 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.1.32 కోట్లుగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. అతను కోల్కత్తాకు చెందిన స్మగ్లర్గా గుర్తించారు.
Read Also: Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
ఈ నెల 9న కోల్కతా నుంచి వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఏపీలోని శ్రీకాకుళంలో ఓ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్చేశారు. వారు తెచ్చిన ట్రాలీ బ్యాగ్లోపల జిప్లైనింగ్ జేబులో 7.396 కేజీల 24 క్యారెట్లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.21కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే అరెస్ట్ చేసిన నిందితులను ప్రశ్నించగా.. బంగ్లాదేశ్నుంచి బంగారాన్ని స్మగ్లింగ్చేసి కోల్కతాలోని బార్లలో కరిగించి ఇలా తరలిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఇద్దరినీ అధికారులు జ్యూడిషియల్కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!