Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఈ రోజు రేట్లు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 61 వేల మార్క్లో గోల్డ్ రేట్ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ రోజు దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,090గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,180గా ఉండగా.. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,940గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 61,030గా ఉంది. ఇక, చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,500గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా కొనసాగుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,990గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,080 దగ్గర ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,850గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 81,500 పలుకుతోంది. కోల్కతాలో రూ. 78,500.. బెంగళూరులో రూ. 81,500గా ఉంది. కాగా, బంగారం ధర మరింత పుంజుకుంటున్న విషయం విదితమే.. బంగారం ధర గత ఇరవై ఏళ్లుగా మరింతగా జోరందుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో రూ.4,400 ఉండగా.. 2005 నాటికి రూ.7 వేలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర రూ.18,500గా ఉండగా.. 2015 నాటికి రూ.26,300కి చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,600గా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.62 వేలకు చేరుకున్న విషయం విదితమే..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు… భారత్ లాంటి దేశాల్లో ఆర్నమెంట్ గోల్డ్ క గిరాకీ పెరగడం ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్ గా చూస్తుండటం కూడా మరో కారణం. ఆర్థిక మాంద్యం భయంతో ప్రభుత్వాలు, దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం కూడా పసిడి పరుగుకు కారణంగా ఉంది. ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరత, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది. చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారెంటీగా 15 శాతం రాబడి ఇస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి. భూముల విలువలు కూడా స్థిరంగా ఉండవు. బంగారం ధరల్లోనూ తేడాలున్నా.. ఓవరాల్ పెరగడమే కానీ.. తగ్గడం అరుదనే వాదన ఉంది. ఈ పాయింటే బంగారంపై పెట్టబడుల్ని బాగా ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!