Godavari River: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం.. 42 అడుగుల వద్దకు తగ్గిన నీటిమట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వరద నీరు భారీగా గోదావరిలో చేరుతుంది. దీంతో పైనుండి వచ్చే వరదలతో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గత మూడు రోజుల నుంచి గోదావరి హెచ్చుతగ్గులు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద స్థాయి దిగువకి ప్రవహిస్తుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోవడంతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. శుక్రవారం గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దాని పర్యవసానం పై నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే రెండు రోజులు ఉండి వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు పరిశీలించారు. నిన్న ఉదయం నుంచి గోదావరి తగ్గు ముఖం పట్టినప్పటికీ మళ్లీ రాత్రి ఒక అడుగు మేరకు పెరిగింది. మళ్లీ మొదటి ప్రమాద స్థాయికి గోదావరి పెరిగింది.
Gujarat: గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్ ప్రమాణ స్వీకారం
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ఆదివారం తెల్లవారు జాము నుంచి మళ్ళీ గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 42 అడుగులతో గోదావరి నీటిమట్టం ఉంది. అంటే మొదటి ప్రమాదవ స్థాయి దిగువలో గోదావరి వరద భద్రాచలం వద్ద ఉన్నది. దిగువన ఉన్న పోలవరం వద్ద గోదావరి నీరు వేగంగా వెళ్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద తగ్గు ముఖం పట్టింది. అయితే శబరి నది కూడా పోటు ఉండటంతో గోదావరి చాలా స్వల్పంగా తగ్గుతూ ఉన్నది. మరోవైపు వరద నీటి వల్ల ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం తెలిపిన సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!