Goa: గోవాలోని ప్రముఖ నైట్క్లబ్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa Nightclub Blast: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్క్లబ్లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో ఘటనాస్థలం ఉంది. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Scrub Typhus Ravaging AP: ఏపీని వణికిస్తున్న స్రబ్ టైఫన్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంటగదిలో పనిచేస్తుండగా, సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోయింది. శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. దీంతో నైట్క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమీప నివాసితులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ అంశంపై గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం గురించి రాత్రి 12:04 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందిందని చెప్పారు. “పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీశాం. క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్లోని వంటగది ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 23 మంది చనిపోయినట్లు నిర్ధారించాం. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.” అని వివరించారు.
READ MORE: Smartwatch: నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించొచ్చా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇంతలో, సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో పర్యాటకులు ఎవరూ గాయపడలేదని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. మంటలు చెలరేగిన సమయంలో క్లబ్లో సిబ్బంది కాకుండా చాలా మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు. కానీ వారందరూ సకాలంలో తప్పించుకున్నట్లు స్థానికులు, ఉద్యోగుల తెలిపారన్నారు.
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!