Kakarla Suresh: ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ పాతుకుపోయిన మేకపాటి కుటుంబం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని.. అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమన్నారు. త్రాగు సాగునీరు తీసుకొస్తామని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆచరణ శూన్యమని ఆరోపించారు. ఇక్కడ ఎన్నారైలే కాదు.. ఎన్ఆర్యూలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత కమిటీని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని.. అంటే ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాల కాలం ముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. అంతకుముందే ఆరు నెలల కాలం 8 మండలాల్లో కావలసిన వనరుల గురించి సర్వే చేయించుకోవడం జరిగిందన్నారు. వాటి ఆధారంగానే ట్రస్టు ద్వారా 17 కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు లక్ష మందిని కలుసుకోవడం జరిగిందన్నారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
CSK: మ్యాచ్కు ముందు చెన్నైకి భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
ఎంతోమంది అభాగ్యులను ఆదుకున్నామన్నారు కాకర్ల సురేష్. సుమారు 30 వేల మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి విలువైన మందులు అందజేయడం జరిగిందన్నారు. ఎంతోమందిని గుండె సంబంధిత వ్యాధులనుండి కాపాడమన్నారు. అదేవిధంగా ప్రతిరోజు 600 నుండి 700 వరకు అన్నా క్యాంటీన్ ద్వారా వింజమూరులో ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఓడిపోతానని అర్థమై అర్థరహితమైన ఆరోపణలు పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. వీటిని క్రమశిక్షణ కలిగిన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని ఘంటా పదంగా చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తానని హెచ్చరించారు.
2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని కాకర్ల సురేష్ తెలిపారు. లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నష్టపోతారని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకోవాలన్నారు. వచ్చే ప్రభుత్వం తెలుగుదేశందే కాదని.. జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని.. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు. అదే విధంగా.. నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికీ సుపరిచితులని.. ఈ ప్రాంతానికి ఆయన ఎంతో చేశారని, ఫ్లోరైడ్ బారి నుండి ఎన్నో కుటుంబాలను కాపాడిన నేతగా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కనుక అటువంటి నాయకుడిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుపై ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ప్రార్థించారు.
Supreme court: తమిళనాడు గవర్నర్ తీరుపై మండిపడ్డ ధర్మాసనం
అంతకుముందు.. ఉదయగిరి ట్యాంక్ బండ్ నుండి టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైకు ర్యాలీ నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో గజమాలతో కాకర్ల సురేష్ చంచల బాబు యాదవ్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాల వారిగా నాయకులు కాకర్ల సురేష్ ను పరిచయం చేసుకుంటూ శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు, ఉదయగిరి మాజీ సర్పంచ్ ఎస్కే రియాజ్, మాజీ జడ్పిటిసి సభ్యులు కలివేల జ్యోతి, మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, ఎల్సీ రమణారెడ్డి, దేవ ప్రసన్న, ముట్టుకుందు వెంకటరెడ్డి ప్రభాకర్, వేగుపాటి రామయ్య, సందాని బొబ్బలి శ్రీనివాసులు, మతకాల శ్రీనివాస్ యాదవ్, లోకసాని రవికుమార్ రెడ్డి, బత్తిన వెంకటేశ్వర్లు, ఆండ్రా పరంధామిరెడ్డి, అబ్రహం, చీపినాపి రాగయ్య, కర్ణాటక కొండలరావు, గడ్డం వెంకటేశ్వర్లు, అడుసుపల్లి వెంకటసుబ్బయ్య, కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామ మహేశ్వరరావు, జనసేన నాయకులు ఉదయగిరి ఇన్చార్జి రాష్ట్ర కమిటీ నెంబర్ బోగినేని కాశీరావు, జిల్లా కార్యదర్శి ఆలూరు రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కొల్లూరు సురేందర్ రెడ్డి, ఉదయగిరి నాయకులు కుర్ర కృష్ణ యాదవ్, సీతారాంపురం మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉదయగిరి మండల నాయకులు పసుపులేటి తిరుపతయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!