Uttar Pradesh: బాలికపై స్కూల్ టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
- 14 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో 14 ఏళ్ల బాలిక ఉపాధ్యాయుడిచే అత్యాచారానికి గురై మరణించింది. 14 ఏళ్ల బాధితురాలు, సోన్భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలోని నివాసి, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉన్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాడని, గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని తెలిపారు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానానికి భయపడి బాధితురాలు ఏమీ చేయలేదని, ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను బంధువుల వద్దకు వెళ్లేందుకు ఛత్తీస్గఢ్కు పంపగా, అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. దీంతో బాధితురాలు మౌనం వీడి జరిగిన విషయాన్ని అత్తకు చెప్పగా.. ఆమె ఆస్పత్రిలో చేర్చింది.
Read Also: Kolkata Doctor Case: ‘దేశం ఆత్మపై దాడి’.. సీజేఐ వద్దకు చేరిన కోల్కతా మహిళా డాక్టర్ హత్య కేసు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పరువు పోతుందని భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబీకులు తెలిపారు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జులై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్లోని బల్లియాకు చెందిన విశాంబర్పై కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న సమయంలో మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!