girl murder : రెండేళ్ల క్రితం బాలికను పొడిచి చంపిన యువకుడు.. ఉరిశిక్ష వేసిన గుజరాత్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండేళ్ల క్రితం ఓ బాలికను అత్యంగత పాశవికంగా పొడిచి చంపిన యువకుడికి గుజరాత్ కోర్డు ఉరిశిక్ష విధించింది. రాజ్ కోట్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన కేసును అరుదైన కేసులో భావించిన న్యా యమూర్తి సదరు యువకుడికి సోమవారం మరణశిక్ష్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ యువకుడు ఇంటర్ చదివే అమ్మాయి వెంట పడి ప్రేమించానంటూ వేధించాడు. తనకు ఇష్టంలూదంటై చెప్పినా వినలేదు.. ఆఖరికి వెంటాడి వేధించి తన ప్రేమను నిరాకరించిన నువ్వు బతకటానికి వీల్లేదని ఆమెపై కత్తితో 34 సార్లు పొడిచి చంపాడు. ఆ తరువాత జైలుపాలయ్యాడు.. అన్ని సాక్షాధారాలు కోర్టుకు సమర్పించడంతో దోషిగా తేలిన ఆ యువకుడికి గుజరాత్ కోర్టు మరణశిక్ష విధించింది.
Also Read : TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రాజ్ కోట్ లో2021 మార్చ్ లో ఇంటర్ చదివే ఓ అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నానంటూ వేధించాడు జయేష్ సార్వయా అనే 26 ఏళ్ల యువకుడు. కానీ ఆమె మాత్రం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. కానీ వినలేదు.. వెంటాడి వేధించాడు.. ఆఖరికి ఓ రోజు జెట్ పూర్ లోని జెతల్ సర్ గ్రామంలో నివసించే ఆమె ఇంటికి వెళ్లి నన్ను ప్రేమిస్తావా లేదా.. అని బెదిరించాడు.. అప్పుడు ఆమె కూడా నిరాకరించింది. దీంతో కొట్టాడు. సదరు బాలిక పారిపోవటానికి ప్రయత్నం చేసింది. వెంటాడి పట్టుకుని కత్తితో 34 సార్లు పొడిచి పొడిచి చంపేశాడు. అడ్డుకున్న కుటుంబసభ్యులపై కూడా దాడి చేశాడు. 34 సార్లు అత్యంత దారుణంగా పొడవటంతో సదరు బాలిక ప్రాణాలు కోల్పోయింది.
Also Read : CM Jagan Mohan Reddy: విశాఖపై జగన్ క్లారిటీ…కొందరు మంత్రులకు క్లాస్
దీంతో కుటుంబసభ్యులు జయేష్ సార్వయాపై పోలీసులకు ఫిర్యదు చేశారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని ఆరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసిన అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు.. కోర్టు నిందితుడికి దోషిగా నిర్థారించి మరణశిక్ష వేసింది. అడిషనల్ డిస్ట్రిక్ట్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనక్ పటేల్ తెలిపారు. సదరు దోషికి ఐపీసీ 302 ప్రకారం మరణశిక్ష ఖరారు చేయబడింది. ఈ శిక్షతో పాటు రూ. 5 వేల జరిమాన కూడా విధించింది. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!