CM Jagan Mohan Reddy: విశాఖపై జగన్ క్లారిటీ…కొందరు మంత్రులకు క్లాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పార్టీ వ్యవహారాలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంలో విశాఖకు పాలనా రాజధాని అంశం పై స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు వెళ్ళనున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.. అప్పటికి అందరూ సిద్దం కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. సమావేశాల్లో మంత్రుల పని తీరు మెరుగ్గా ఉండాలని సూచించారు. మీ శాఖలకు సంబంధించి కూలంకషంగా అధ్యయనం చేసి సమాధానాలు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా సీఎం సూచనలు చేశారు.
Read Also:Alleti Maheshwar reddy: మీరే ఇలా చేస్తే ఎలా? మాణిక్రావ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
కొందరు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. మంత్రులు మారకపోతే ఒకరిద్దరిని తప్పించటానికీ వెనుకాడను అని సూచన ప్రాయంగా తెలిపారు. టీడీపీ చేసే విమర్శలకు దూకుడుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. మొత్తం మీద విశాఖను పాలనా రాజధానిగా చేయడంతో పాటు అక్కడినుంచి తమ పాలన బాధ్యతలను నిర్వహించడానికి జగన్ నిర్ణయించుకున్నారు. రాబోయే కాలం చాలా కీలకం అనీ, మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు జగన్. సరిగా పనిచేయని మంత్రులకు జగన్ ఒక అవకాశం ఇచ్చారని, పనితీరు మార్చుకోకపోతే వారిపై వేటు పడుతుందనే సంకేతాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈనెల 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామన్నారు చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈనెల 16వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. 22వ తేదీ ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుందన్నారు. సంక్షేమ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడతామని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు.
Read Also: Adani Son Engagement: గౌతమ్ అదానీ కొడుకు ఎంగేజ్మెంట్.. వధువు ఎవరంటే..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!