Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెలియజేస్తానని ఖర్గే హామీ ఇచ్చారు.. రాహుల్ గాంధీ చేసిన “భారత్ జోడో” యాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్బంగా మంత్రాలయంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అని రుద్రరాజు పేర్కొన్నారు. “కుల గణన” పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు కృతజ్ణతలు తెలిపాను అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Viral Video : ఇదేందయ్యా ఇది.. ఇలా తయారైయ్యారేంట్రా జనాలు..
Also Read
- LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
- సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
- Bill Gates: "అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది".. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
- Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
“కాంగ్రస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో “కుల గణన” పైనే విస్తృతంగా చర్చ జరిగింది అని సీడబ్య్లూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. 2011లో యుపీఏ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన “కుల గణన” వివరాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. 2013-14లో కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ఉన్నప్పుడు నిర్వహించిన “కుల గణన” వివరాలను వచ్చే నవంబర్ లో బహిర్గతం చేయబోతున్నట్లు ఈ రోజు జరిగిన “సీడబ్ల్యుసీ” సమావేశంలో కర్ణాటక సీఎం తెలిపారు అని ఆయన అన్నారు.
Read Also: CM Jagan Review: కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం
“కుల గణన” వలన సరైన రీతిలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు జరుగుతాయని రఘువీరారెడ్డి అన్నారు. “సమ సమాజ” స్థాపనకు “కుల గణన” దోహదం చేస్తుందనే విశ్వాసం తో ఉన్నాం.. పండిట్ నెహ్రూ నుంచి, ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ “సామాజిక న్యాయం”కు కట్టుబడి ఉంది.. అలాగే, మోడీ ప్రభుత్వం చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కూడా చర్చించాం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో సహా రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడం లాంటి అంశాలపై చర్చించామని రఘువీరా రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!