Ganesh Visarjan : గణేష్ నిమజ్జనోత్సవాలకు జీహెచ్ఎంసీ రెడీ.. బైబై గణేషా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్సాగర్, ప్రధాన చెరువుల్లో బేబీ పాండ్స్తో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ట్యాంక్ బండ్లో 30 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 14 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా పీఓపీ విగ్రహాల కోసం 72 బేబీ పాండ్లను ఏర్పాటు చేశారు.
చెరువుల పక్కనే 28 బేబీ చెరువులు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 12 అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఒకసారి 60 నుంచి 80 విగ్రహాలు నిమజ్జనం చేసి వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్స్ను ఏర్పాటు చేశారు. వీటిలో 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. 23 ప్రాంతాల్లో తాత్కాలిక బేబీ పాండ్లు నిర్మించి అందులో 6 నుంచి 8 అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
నగరంలోని ప్రధాన రహదారుల్లో 354 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర సాగనుంది. ఈ క్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ విభాగం పూడ్చింది. రూ.2.15 కోట్లతో 354 కిలోమీటర్ల రోడ్లలో నిమజ్జన కేంద్రాల వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.శోభాయాత్ర మార్గంలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి, ఇతర వ్యర్థాలను తొలగించారు. శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య పనుల కోసం పది వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. పది వేల మంది కార్మికులు, 295 మంది జవాన్లు, 688 మంది ఎస్ఎఫ్ఐలతో 168 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో క్రేన్ వద్ద 21 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
క్రేన్లపై పనిచేసేందుకు వెయ్యి మంది ఎంటమాలజీ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. 75 ప్రాంతాలతో పాటు హుస్సేన్ సాగర్, సరూర్నగర్ చెరువు, కూకట్పల్లి, కాప్రా, మల్కాజిగిరి సరస్సులలో నిమజ్జనం చేయనున్నారు. డైవింగ్ ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.వివిధ ప్రాంతాల్లో అవసరమైన స్టేజీలు, భారీ కేసింగ్ను ఆర్అండ్బీ ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద జలమండలి తాగునీటిని సరఫరా చేయనుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఊరేగింపు మార్గాల్లో వీధిలైట్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!