Indian Submarine Deal: భారతీయ జలాంతర్గామి కోసం పోటీపడుతున్న జర్మనీ, స్పెయిన్..4.8 బిలియన్ డాలర్ల డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Submarine Deal: భారతదేశ జలాంతర్గామిని తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇవి 2 యూరోపియన్ కంపెనీలు అందులో ఒకటి జర్మనీకి చెందిన Thyssenkrupp AG కాగా మరొకటి స్పెయిన్కు చెందిన నవాంటియా. Thyssenkrupp AG ఈ ఆర్డర్ కోసం Mazagon Dock Shipbuilders Ltd of Indiaతో ఒప్పందం చేసుకుంది. స్పెయిన్కు చెందిన నవాంటియా లార్సెన్ & టూబ్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్డర్ విలువ రూ. 40,000 కోట్లు ($4.8 బిలియన్లు). అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లార్సెన్ & టూబ్రో, మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. జర్మనీకి చెందిన థైసెన్క్రూప్ బిడ్ను ధృవీకరించారు. ఇది కాకుండా స్పానిష్ కంపెనీ నవాంటియా కూడా సమాధానం కోసం వేచి ఉంది.
Read Also:Realme 11 5G Launch: ఆగష్టు 23న రియల్మీ 11 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
6 ఓడల నిర్మాణం
దేశంలో ఆరు నౌకలను నిర్మించడానికి భారత అధికారులు ప్రస్తుతం పోటీ బిడ్లను అంచనా వేస్తున్నారు. జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్ను ప్రకటించింది. ఈ టెండర్ కింద జలాంతర్గాములకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. దీని సాయంతో నౌకలు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు సహాయపడేలా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.
ఎందుకు భారతదేశం దృష్టి
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా నావికాదళాన్ని ఎదుర్కోవడానికి దక్షిణాసియా దేశం తన నౌకాదళాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. భారత నౌకాదళానికి కనీసం 24 సంప్రదాయ జలాంతర్గాములు అవసరం, కానీ ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. వీటిలో చాలా వరకు 30 ఏళ్లు పైబడినవే కావడం వల్ల వచ్చే కొన్నేళ్లలో వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.
Read Also:Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
ఎగిసిన స్టాక్
ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తలు రావడంతో మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు BSEలో దాదాపు 5 శాతం పెరిగాయి. ప్రతి స్టాక్ ధర రూ.1944కి చేరుకుంది. అదే సమయంలో L&T షేర్లు కూడా దాదాపు 1 శాతం పెరిగి రూ.2675 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!