Jharkhand : చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చిన్నారిని మంటలో పడేసిన ఆస్పత్రి సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని గర్వా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే వార్త తెరపైకి వచ్చింది. ప్రసవ నొప్పి రావడంతో ఒక మహిళ ఆ ప్రాంతంలోని మజియాన్ సిహెచ్సి ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కుటుంబం చిన్నారి అంత్యక్రియలకు సిద్ధం చేయడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులు పిల్లల మృతదేహాన్ని అడగడంతో ఆస్పత్రి సిబ్బంది చెప్పినది విని షాక్ తిన్నారు.
Read Also:Telangana 2k run: తెలంగాణ వ్యాప్తంగా 2కే రన్.. పోలీస్ శాఖ అధ్వర్యంలో కార్యక్రమం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నిజానికి ఆ చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రి ఆవరణలో కాలుతున్న చెత్తలో పడేశారు. ఇది విన్న బంధువులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. అక్కడ తోపులాట జరిగింది. సమాచారం అందిన వెంటనే ఎస్డిఎం ఆదేశాల మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ రాజీవ్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కమలేష్ కుమార్ మహతో మహిళా పోలీసులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఏఎన్ఎం మంజు కుమారి, నిర్మల కుమారి, మంత్రసాని దౌలత్ కున్వర్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
Read Also:Student Suicide: కృష్ణా జిల్లాలో యువతి ఆత్మహత్య.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
వివరాల్లోకి వెళితే.. పాలము జిల్లాలోని రాజ్హారాలోని లాలాహె గ్రామానికి చెందిన మన్దీప్ విశ్వర్మ భార్యకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి వచ్చింది. అనంతరం హుటాహుటిన సీహెచ్సీ రెఫరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ANM ఆమెకు ప్రసవం చేయగా మహిళ చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఏఎన్ఎం నిర్మల కుమారి, మంజు కుమారిలు ఆమెకు చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన బంధువులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే దై దౌలత్ దేవి చనిపోయిన చిన్నారిని చెత్త పారవేయడానికి ఉద్దేశించిన లోతైన ట్యాంక్లో కాలుతున్న చెత్తలో పడేసిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంగా బిడ్డను మంటలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సిగ్గుమాలిన చర్యపై మొత్తం ఆసుపత్రిలో పెద్ద దుమారం చెలరేగింది. ప్రసవం అయిన తర్వాత మమ్మల్ని అడగకుండా కాలిపోతున్న చెత్తకుప్పలో చనిపోయిన బిడ్డను విసిరినట్లు మహిళకు చికిత్స చేసిన ఇద్దరు ANM లు కూడా అంగీకరించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!