Gang Rape : కామపిశాచులకు కేరాఫ్.. మతిస్థిమితం లేని మహిళను సైతం వదలని మృగాళ్లు
- మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
- మతిస్థిమితం లేని మహిళ పై లైంగిక దాడి
- మియాపూర్ బొల్లారం x రోడ్ లో మహిళని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి సామూహిక ఆత్యాచారం
- పోలీస్ ల అదుపులో ఇద్దరు నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang Rape : ఇటీవల అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటం అత్యంత ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ వయస్సు వారినైనా లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు తమ కీచక కోరికలు తీర్చుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాలు, కూడా మహిళలకు సురక్షిత ప్రదేశాలుగా మారలేని పరిస్థితి ఏర్పడింది. బాలికలు కూడా ఈ దారుణాలకు గురవుతుండటం గమనార్హం. ఇటీవల అనేక స్కూల్ విద్యార్థినులు వారి బంధువుల చేతుల్లోనే అత్యాచారానికి గురవుతున్న దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
TTD: తిరుమలలో ఎట్టకేలకు ముగిసిన వివాదం..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లపైన, కార్యాలయాల్లో, అద్దె ఇళ్లలో, విద్యాసంస్థల్లో కూడా ఈ తరహా నేరాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తుంది. రోజుకు ఎన్నో అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. కానీ, వాటిలో చాలా తక్కువ శాతం మాత్రమే దోషులను శిక్షించే వరకు వెళ్తున్నాయి. బాధితులపై సమాజం ఒత్తిడి తెచ్చి వాటిని అణిచివేయడం, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్థులు మరింత ధైర్యంగా మారుతున్నారు.
మహిళలు రాత్రివేళ బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి. తమకు రక్షణ ఉండదనే భావనతో జీవించాల్సి వస్తోంది. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలను ఒంటరిగా బయటికి పంపడానికి భయపడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకపోవడం, కేసులు సంవత్సరాల తరబడి నడవడం వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుంది. తాజాగా మరో సంఘటన హైదరాబాద్లోని మియాపూర్లో చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని మహిళ పై లైంగిక దాడి పాల్పడ్డారు దుండగులు. మియాపూర్ బొల్లారం x రోడ్ లో మహిళని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి సామూహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Delhi : గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ. 21,000ఇవ్వనున్న ప్రభుత్వం ?
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!