Game Changer Event : సర్వం సిద్ధం.. ఆరోజు వేరు, ఈరోజు వేరు.. రీసౌండ్ రావాల్సిందే!
- గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరు కానున్న పవన్ కళ్యాణ్
- భారీగా బందోబస్త్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Event : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదిక పై కనిపించడం కొత్త కాదు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వేదికను పంచుకోబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. చివరగా బాబాయ్, అబ్బాయ్ కలిసి పిఠాపురం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పవన్ గెలుపు కోసం పిఠాపురం వెళ్లాడు చరణ్. అదంతా పొలిటికల్ హీట్లో వెళ్లిపోయింది. ఫైనల్గా.. పవన్ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. జనసేన పార్టీ అఖండ విజయం ఆకాశాన్నంటే ఉత్సాహం ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అనే నేను.. అని పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం నాడు యావత్ దేశం మార్మోగిపోయింది. ఇక ఇప్పుడు ఏపి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. అబ్బాయ్ కోసం వస్తుండడం ఫ్యాన్స్కు ఎక్కడా లేని హై ఇస్తోంది.
Read Also:Pushpa 2 : కెనడాలో ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప 2’
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇదే. అది కూడా అబ్బాయ్ సినిమా కావడంతో.. ఈరోజు రాజమండ్రిలో జరగనున్నఈవెంట్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఏపి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ ట్యాగ్తో రామ్ చరణ్ వస్తున్న తొలి భారీ ఈవెంట్ ఇది. అందుకే.. ఈసారి బాబాయ్, అబ్బాయ్ దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ రావాల్సిందే. ఇప్పటికే ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దాదాపు లక్ష మంది అభిమానులు రానున్నారనే అంచనాతో భారీ బందోబస్తు చేశారు పోలీసులు. పది అడుగుల ఎత్తులో వేదిక నిర్మించగా.. పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Read Also:Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
వేదిక చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బందోబస్తులో 400 మంది పోలీస్ అధికారులు,1200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనున్నారు. గ్రౌండ్ సమీపంలో 20 వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, హైమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు.. ఈ ఈవెంట్ కోసం ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు ఎంట్రీ పాసుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఈ ఈవెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్కు చాలా స్పెషల్గా నిలవనుందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!