IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కీలక సూచన!
- డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు
- టీమిండియాకు మాజీ ఓపెనర్ కీలక సూచన
- అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న గబ్బాలో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్.. అడిలైడ్ టెస్టులో ఓడిపోయింది. ఇక బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్లలో మూడుసార్లు 200 పరుగులలోపే భారత్ ఆలౌటైంది.
ఇటీవలి రోజుల్లో భారత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. టీమిండియా వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని, కనీసం 350 పరుగులు చేయాలని సూచించాడు. ‘టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక రోజైనా బ్యాటింగ్ చేయాలి. ఒక రోజులోపే ఆలౌట్ అవ్వడం ఏమాత్రం సరికాదు. స్కోర్ బోర్డుపై కనీసం 350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా.. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్కు దిగినప్పుడు 4, 5 స్టంప్ లైన్పై ఎక్కువగా బంతులు వేయాలి. బౌన్స్ను బాగా ఉపయోగించుకోవాలి. బ్రిస్బేన్లో పేసర్లకు ఇదే ప్రధాన అస్త్రం. మూడో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే గత పర్యటనలో ఇక్కడ ఆస్ట్రేలియాని టీమిండియా ఓడించింది’ అని హేడెన్ చెప్పాడు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
బ్రిస్బేన్లోని గబ్బాలో భారత్ ఏడు టెస్టులు ఆడగా.. ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీమిండియా గెలిచింది. 2003లో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా కాగా.. మిగతా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. గబ్బాలో రికార్డు ఏమాత్రం బాగా లేకపోవడం, ఇటీవలి భారత్ ఫామ్. అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!