Ruchira Kamboj: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruchira Kamboj: భారత్లో జరిగిన జీ-20 సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చర్చల్లో కేంద్రంగా ఉంచామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. దీని అమలు విషయంలో కూడా నిబద్ధత ప్రదర్శించామన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశ ప్రయాణం సంకల్పం స్ఫూర్తిదాయక ఉదాహరణ అని రుచిరా అన్నారు.
Also Read: China Bat Woman: కరోనా లాంటి మరో ప్రాణాంతక మహమ్మారి.. చైనా బ్యాట్ ఉమన్ హెచ్చరిక
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్లో భాగంగా శుక్రవారం ‘ఇండియా రౌండ్ టేబుల్: డెలివరింగ్ డెవలప్మెంట్: జర్నీస్, డైరెక్షన్స్ అండ్ లైట్హౌసెస్’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అమలుకు భారతదేశం కట్టుబడి ఉందని రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని, భారత్ ఈ సవాల్ను సాధించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మా సమిష్టి సంకల్పం పునరుద్ఘాటించబడిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Also Read: Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
రుచిరా కంబాజ్ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 12 శాతం మాత్రమే ట్రాక్లో ఉన్నాయని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక చూపిస్తుందని, 50 శాతం పురోగతి బలహీనంగా ఉందని, అన్నింటికంటే అధ్వాన్నంగా ఉందని అన్నారు. నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, నాలుగేళ్ల క్రితం కంటే నేడు ఎక్కువ మంది పేదలు ఉన్నారని రుచిరా కాంబోజ్ అన్నారు. ప్రస్తుత ప్రగతిని బట్టి చూస్తే 2030 నాటికి ‘పేదలు వద్దు’ అనే లక్ష్యాన్ని 30 శాతం దేశాలు మాత్రమే సాధించగలుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇందులో భారతదేశం అద్భుత ఫలితాలను సాధించిందని, 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించడంలో విజయం సాధిస్తామన్నారు రుచిరా కాంబోజ్.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!