Ruchira Kamboj: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruchira Kamboj: భారత్లో జరిగిన జీ-20 సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చర్చల్లో కేంద్రంగా ఉంచామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. దీని అమలు విషయంలో కూడా నిబద్ధత ప్రదర్శించామన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశ ప్రయాణం సంకల్పం స్ఫూర్తిదాయక ఉదాహరణ అని రుచిరా అన్నారు.
Also Read: China Bat Woman: కరోనా లాంటి మరో ప్రాణాంతక మహమ్మారి.. చైనా బ్యాట్ ఉమన్ హెచ్చరిక
Also Read
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
- Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్లో భాగంగా శుక్రవారం ‘ఇండియా రౌండ్ టేబుల్: డెలివరింగ్ డెవలప్మెంట్: జర్నీస్, డైరెక్షన్స్ అండ్ లైట్హౌసెస్’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అమలుకు భారతదేశం కట్టుబడి ఉందని రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని, భారత్ ఈ సవాల్ను సాధించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మా సమిష్టి సంకల్పం పునరుద్ఘాటించబడిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Also Read: Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
రుచిరా కంబాజ్ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 12 శాతం మాత్రమే ట్రాక్లో ఉన్నాయని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక చూపిస్తుందని, 50 శాతం పురోగతి బలహీనంగా ఉందని, అన్నింటికంటే అధ్వాన్నంగా ఉందని అన్నారు. నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, నాలుగేళ్ల క్రితం కంటే నేడు ఎక్కువ మంది పేదలు ఉన్నారని రుచిరా కాంబోజ్ అన్నారు. ప్రస్తుత ప్రగతిని బట్టి చూస్తే 2030 నాటికి ‘పేదలు వద్దు’ అనే లక్ష్యాన్ని 30 శాతం దేశాలు మాత్రమే సాధించగలుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇందులో భారతదేశం అద్భుత ఫలితాలను సాధించిందని, 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించడంలో విజయం సాధిస్తామన్నారు రుచిరా కాంబోజ్.
తాజావార్తలు
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..