Ruchira Kamboj: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉంది..
Ruchira Kamboj: భారత్లో జరిగిన జీ-20 సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చర్చల్లో కేంద్రంగా ఉంచామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. దీని అమలు విషయంలో కూడా నిబద్ధత ప్రదర్శించామన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశ ప్రయాణం సంకల్పం స్ఫూర్తిదాయక ఉదాహరణ అని రుచిరా అన్నారు.
Also Read: China Bat Woman: కరోనా లాంటి మరో ప్రాణాంతక మహమ్మారి.. చైనా బ్యాట్ ఉమన్ హెచ్చరిక
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్లో భాగంగా శుక్రవారం ‘ఇండియా రౌండ్ టేబుల్: డెలివరింగ్ డెవలప్మెంట్: జర్నీస్, డైరెక్షన్స్ అండ్ లైట్హౌసెస్’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అమలుకు భారతదేశం కట్టుబడి ఉందని రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని, భారత్ ఈ సవాల్ను సాధించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మా సమిష్టి సంకల్పం పునరుద్ఘాటించబడిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Also Read: Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
రుచిరా కంబాజ్ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 12 శాతం మాత్రమే ట్రాక్లో ఉన్నాయని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక చూపిస్తుందని, 50 శాతం పురోగతి బలహీనంగా ఉందని, అన్నింటికంటే అధ్వాన్నంగా ఉందని అన్నారు. నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, నాలుగేళ్ల క్రితం కంటే నేడు ఎక్కువ మంది పేదలు ఉన్నారని రుచిరా కాంబోజ్ అన్నారు. ప్రస్తుత ప్రగతిని బట్టి చూస్తే 2030 నాటికి ‘పేదలు వద్దు’ అనే లక్ష్యాన్ని 30 శాతం దేశాలు మాత్రమే సాధించగలుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇందులో భారతదేశం అద్భుత ఫలితాలను సాధించిందని, 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించడంలో విజయం సాధిస్తామన్నారు రుచిరా కాంబోజ్.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో