Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!
- రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు
- ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించాం
- ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు . నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్ సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు సీఎం కేటాయించారని మంత్రి నిమ్మల చెప్పుకోచ్చాడు.
రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… ‘అన్నమయ్య ప్రాజెక్టు తక్కువ నిర్మాణంతో రూపొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈలోపు వాస్తవ పరిస్థితిని అధికారులతో చర్చిస్తున్నాం. డ్యామ్ నిర్మాణం పూర్తి అయ్యేలోపు రైతుల సూచనల మేరకు లిఫ్ట్ ద్వారా కెనాల్స్ ద్వారా మీరు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. గత పాలకుల ఇసుక దోపిడీ, లూటీ వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. 41 మంది చనిపోతే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం పరామర్శించలేదు. అన్నమయ్య డ్యామ్ నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నాం’ అని అన్నారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
‘నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చింది. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించాం. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు కేటా్యుంచారు చంద్రబాబు. ఒంటిమిట్ట భూ కబ్జాదారులను కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..