Revanth Reddy: జనగర్జన సభ నుండి బీఆర్ఎస్కు సమాధి కడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని తెలిపారు. అందుకోసం సభ ఏర్పాట్ల పరిశీలనకై ఖమ్మం వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీగా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భారీ ఎత్తున సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులు అడిగారన్నారు. ఆర్టీసీ అధికారులు ముందు బస్సులు ఇస్తామని, ఇప్పుడు బస్సులు ఇవ్వలేమని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఇచ్చిన ఇవ్వకున్నా సొంత వాహనాల్లో సభకు రావాలని రేవంత్ పిలపునిచ్చారు.
Read Also: Disha Patani: బాబోయ్.. ఇంత హాట్ అయితే తట్టుకోవడం కష్టమే..
Also Read
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
భట్టి విక్రమార్క వెయ్యి కిలోమీటర్లు నడిచి ఖమ్మంలోకి వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఏమాత్రం అడ్డుకోలేరన్నారు. ఎవరు అడ్డుకున్న తొక్కుకుని జనగర్జన సభకు రండి అని రేవంత్ పిలుపునిచ్చారు. ఇంటెలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి సీఎం కేసీఅర్ కి పెట్టండని అన్నారు. జనగర్జన సభ నుండి BRS కు సమాధి కడతామని రేవంత్ పేర్కొన్నారు. మరోవైపు మా అక్క రేణుకమ్మ, భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ కి రెండు కళ్లు అని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు. మూడో కన్ను తెరిచిన శివుడిలా ఖమ్మం జిల్లా నుండి విజయయాత్ర ప్రారంభం కావాలని రేవంత్ తెలిపారు.
Read Also: Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్
అంతేకాకుండా మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో వుంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఏర్పడుతుందని.. ఇప్పుడున్నది శాంపిల్ గవర్నమెంట్ అని విమర్శించారు. ఖమ్మం జనగర్జన సభ ద్వారా కారుగుర్తును బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పోడు భూములపై చేసాడని.. కాంగ్రెస్ పార్టీ నేత పోరాటాల వల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!