PM Modi-Bill Gates: డిజిటల్ రంగంతో భారత్లో చాలా మార్పులు వచ్చాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం కొనసాగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాతావరణంలో మార్పులు లాంటి అనేక అంశాలపై వీరు ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఆ చర్చలో భారతీయులపై బిల్ గేట్స్ ప్రసంశలు కురిపించాడు. టెక్నాలజీని భారతీయుల చాలా వేగంగా ఆపాదించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. పీఎం నమో యాప్లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్తో ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ దిగారు.
Read Also: Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
Also Read
ఇక, డిజిటిల్ విప్లవంలో భారత్ వేగంగా దూసుకుపోతుంది.. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా ఇండియా స్పీడ్ అందుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన టైంలో భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని ఆయన చెప్పారు. అయితే, ఏకఛత్రాధిపత్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీని ప్రజాస్వామ్యంగా మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు మోడీ బిల్ గేట్స్ కు తెలిపారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, జీ-20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగింది.. ఇండియా ఆ సదస్సును అద్భుతంగా నిర్వహించిందని మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. భారత్లో డిజిటల్ విభజన జరగకుండా చూస్తాను.. డిజిటల్ మౌళిక సదుపాయాల్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
#WATCH | As PM Narendra Modi and Bill Gates talk about the digital revolution in India, the PM also tells him about 'Namo Drone Didi' scheme
PM says, "When I used to hear about the digital divide in the world, I used to think that I would not allow anything like that to happen… pic.twitter.com/ib79pnc2sB
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!