Nadendla Manohar : ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం
- ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించాం
- మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం, ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడ్డాయి : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar : ప్రభుత్వం ‘సూపర్ సిక్స్ హామీలు’ కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే, మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడినట్టు ఆయన చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!
Also Read
మరోవైపు, ‘దీపం-2’ పథకంపై శాసన మండలిలో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకం అమలవుతున్నదని, సిలిండర్ డెలివరీ తరువాత మాత్రమే సబ్సిడీ అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని 3 విడతలుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని ఆయన తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలు ఈ పథకంపై ప్రజల్లో అపోహలుమ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘గ్యాస్ సిలిండర్ల పథకంపై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 35 లక్షల 77 వేల 566 గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 2700 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని అంచనా వేశాం. అందరికీ ఒకేసారి కోట్లలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ కంపెనీలు చెప్పాయి. మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!