Nadendla Manohar : ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం
- ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించాం
- మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం, ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడ్డాయి : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar : ప్రభుత్వం ‘సూపర్ సిక్స్ హామీలు’ కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే, మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడినట్టు ఆయన చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!
Also Read
మరోవైపు, ‘దీపం-2’ పథకంపై శాసన మండలిలో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకం అమలవుతున్నదని, సిలిండర్ డెలివరీ తరువాత మాత్రమే సబ్సిడీ అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని 3 విడతలుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని ఆయన తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలు ఈ పథకంపై ప్రజల్లో అపోహలుమ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘గ్యాస్ సిలిండర్ల పథకంపై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 35 లక్షల 77 వేల 566 గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 2700 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని అంచనా వేశాం. అందరికీ ఒకేసారి కోట్లలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ కంపెనీలు చెప్పాయి. మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!