Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం
- ఏప్రిల్ 1 నుంచి జమ్మూ కశ్మీర్లోని మహిళలకు ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
- నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా, వారి దైనందిన జీవన విధానానికి సౌలభ్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారికి మరింత స్వేచ్ఛ, అవకాశాలను అందించనుందని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్ మహిళలు హర్షిస్తున్నారు. ఉచిత ప్రయాణం ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుందని పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో నాణ్యత, భద్రతను తప్పకుండా కాపాడాలని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, 2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ కశ్మీర్లో మహిళల జనాభా 59 లక్షలు. ఇది గడిచిన 14 ఏళ్లలో మరింత పెరిగింది. అంతేకాదు, రాష్ట్రంలో మహిళా సాక్షరత శాతం కూడా పెరుగుతోంది. దీంతో ఉద్యోగాలు, విద్య కోసం మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఈ పథకం అమలుతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (SRTC), స్మార్ట్ సిటీ బస్సుల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే,ఈ విషయంపై SRTC జనరల్ మేనేజర్ షౌకత్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలానే, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు కూడా తమ వ్యాపారంపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..
మొత్తానికి సర్కారీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఖచ్చితంగా ప్రయోజనకరమైనదే. అయితే, దీని వల్ల ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్సుల ఆదాయంపై ప్రభావం పడనుంది. ప్రభుత్వం తగిన ప్రణాళికతో ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తుందని సంబంధిత యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, వారి భద్రతపై కూడా దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ ఉచిత ప్రయాణ విధానం ఎలా ప్రభావం చూపుతుందో చూడాలిమరి.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!