NTV Telugu Site icon

AP Crime: మైనర్ బాలికపై అఘాయిత్యం..! ఇద్దరు వీఆర్వోలపై ఫోక్సో కేసు

Hyderabad Crime

Hyderabad Crime

AP Crime: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ వీఆర్వోగా పనిచేస్తున్న ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో గా పనిచేస్తున్న పార్ల వెంకటరావులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. విజయనగరానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు అందింది, సదరు బాలికను విచారించగా నిడదవోలుకు చెందిన షేక్ అఖిలాండేశ్వరి, బండారి లలిత, దాడిశెట్టి దుర్గారావు.. ఈ బాలికకు డబ్బులు ఎరగా చూపి వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలిపింది. దీనిలో భాగంగానే ఈ మైనర్ బాలికను పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో పార్ల వెంకటరావు.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారట.. వారిని డబ్బులు అడగగా ఇవ్వని కారణంగా నిడదవోలు పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబును నిడదవోలు గణపతి సెంటర్ లో దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్లు పోలీసులకు తెలిసింది.

Read Also: Andhra Pradesh: దంచికొడుతున్న ఎండలు.. ఏప్రిల్‌ను మరిపిస్తున్న ఫిబ్రవరి..!

సదరు మైనర్ బాలికను వ్యభిచారం కూపంలోకి దింపిన ముగ్గురు సభ్యులను, అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు విఆర్వోలపై Cr. No: 52/2024, IPC SEC 366 A, 370 A, 376 D R/W 34, 5 & 6 R/W 17/ ఫోక్సో యాక్ట్, 5/ITP యాక్ట్ కేసులు పోలీసులు నమోదు చేశారు. వీరిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా వీఆర్వో పై దాడి చేసిన దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమందిపై IPC SEC 341, 323, 506 R/W 34 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపడుతున్నట్టు పోలీసులు అధికారులు చెబుతున్నారు.