double bedroom scam: డబుల్ బెడ్రూం స్కాంలో నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
double bedroom scam: మహబూబ్ నగర్ లో వెలుగు చూసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ ఉన్నాడు. వీరంతా డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు పూర్తి వివరాలను మహబూబ్నగర్రూరల్ సీఐ రాజేశ్వర్గౌడ్ మీడియాకు తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్రెడ్డికి న్యూ గంజ్కు చెందిన సిరాజుద్దీన్ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్బెడ్రూమ్ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్ ఖాద్రీ…అరుణ్కుమార్రెడ్డి నుంచే కాకుండా ఖాదర్అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: viral news: ఎంత చదవాలి.. ముసలాడిని అయ్యేలా ఉన్న.. నవ్వు తెప్పిస్తున్న బుడ్డోడి మాటలు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
రెండో కేసులో జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్ఇచ్చిన కంప్లయింట్మేరకు పట్టణంలోని ఆల్మాస్ఖాన్ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్, బోయపల్లి గేట్ప్రాంతానికి చెందిన మహ్మద్ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్ బెడ్రూమ్ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్మేరకు ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్ కొడుకు అక్షయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Read also:Radha Tmt: మార్కెట్లోకి రాధా టీఎంటీ సరికొత్త మోడల్
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!