double bedroom scam: డబుల్ బెడ్రూం స్కాంలో నలుగురి అరెస్ట్
double bedroom scam: మహబూబ్ నగర్ లో వెలుగు చూసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ ఉన్నాడు. వీరంతా డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు పూర్తి వివరాలను మహబూబ్నగర్రూరల్ సీఐ రాజేశ్వర్గౌడ్ మీడియాకు తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్రెడ్డికి న్యూ గంజ్కు చెందిన సిరాజుద్దీన్ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్బెడ్రూమ్ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్ ఖాద్రీ…అరుణ్కుమార్రెడ్డి నుంచే కాకుండా ఖాదర్అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: viral news: ఎంత చదవాలి.. ముసలాడిని అయ్యేలా ఉన్న.. నవ్వు తెప్పిస్తున్న బుడ్డోడి మాటలు
Also Read
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
- Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
రెండో కేసులో జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్ఇచ్చిన కంప్లయింట్మేరకు పట్టణంలోని ఆల్మాస్ఖాన్ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్, బోయపల్లి గేట్ప్రాంతానికి చెందిన మహ్మద్ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్ బెడ్రూమ్ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్మేరకు ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్ కొడుకు అక్షయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Read also:Radha Tmt: మార్కెట్లోకి రాధా టీఎంటీ సరికొత్త మోడల్
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!