Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిపోయింది?.. కేంద్ర మాజీ మంత్రి ప్రకటన

  • ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
  • సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ఖరారు
  • కేంద్ర మాజీ మంత్రి సంచలన ప్రకటన
Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ఖరారు చేసినప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే అన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

READ MORE: Arvind Kejriwal: కాంగ్రెస్‌తో పొత్తుపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్వే మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి ఎవరో ఇప్పుడు పార్టీ నేతలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా తెలుసునని అన్నారు. ఆ వ్యక్తి పేరును మా పార్టీ సీనియర్ నేతలు ధ్రువీకరించాల్సి ఉంది. పార్టీ హైకమాండ్ అధికారికంగా ఆమోదం తెలిపిన వెంటనే ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తాం. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయించుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత.” అని ఆయన స్పష్టం చేశారు.

READ MORE: Mohan Bhagwat : ప్రతి ఒక్కరూ ముగ్గురు పిల్లలను కనాలి.. లేదంటే చాలా ప్రమాదం!

సతారాలో గ్రామలో షిండే సందర్శించడం గురించి అడిగినప్పుడు, దన్వే మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి తన స్వస్థలాన్ని సందర్శించినప్పుడు మేము గర్వపడుతున్నాము. ఆయన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, దన్వే మాట్లాడుతూ, తాత్కాలిక ముఖ్యమంత్రి ఆరోగ్యం రాష్ట్ర పరిపాలనకు ఆటంకం కలిగించదని (యుపిఎ ప్రభుత్వం) మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు, అతను గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. పరిపాలన కొనసాగుతుంది.

READ MORE:Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..

కాగా.. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు మహాయుతి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. కానీ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ముందు వరుసలో ఉంది. ఫడ్నవీస్ రెండుసార్లు ముఖ్యమంత్రి వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా కొంతకాలం క్రితం విలేకరుల సమావేశంలో బీజేపీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.