Konakalla Narayana: వైసీపీ వైపు టీడీపీ మాజీ ఎంపీ చూపు..!? క్లారిటీ ఇచ్చిన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konakalla Narayana: ఎన్నికల సమయంలో కొందరు నేతలు.. కొన్ని గంటల్లోనే పార్టీ కండువా మార్చేస్తున్నారు.. మరికొందరు అలా వెళ్లి ఇలా మళ్లీ వెనక్కి వస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన ప్రచారం వాళ్లు చేస్తున్నారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. పార్టీ మార్పుపై సోషల్ మీడియా వేదిక వారే నడుస్తోంది.. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. టీడీపీకి గుడ్బై చెబుతారని.. త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఫేస్ బుక్, వాట్సప్ గ్రూప్స్ లో వైరల్ గా మారిపోయింది కొనకళ్లకు సంబంధించిన పోస్టు.. అయితే, ఇది వైసీపీ మైండ్ గేమ్ అని కొనకళ్ల పార్టీ మారటం జరగదని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వచ్చారు కొనకళ్ల అనుచరులు..
Read Also: Nuzvid: నూజివీడులో ఆసక్తికర పరిణామాలు.. ఇంఛార్జ్ని ప్రకటించిన టీడీపీ
Also Read
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
ఇక, పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కొనకళ్ల.. వైసీపీలో చేరికపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పందిస్తూ.. రెండు రోజులుగా వైసీపీలో కొనకళ్ల చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోనే కొనసాగుతాను అని ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నా అని జరుగుతున్న ప్రచారం సత్యదూరం.. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.. నాకు వైసీపీలో చేరే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. కాగా, బందరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి ఆయన.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉందని.. దీంతో కొనకళ్లతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరగడంతో.. చివరకు అలాంటి ఏమీ లేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?