Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Economy Former Rbi Governor Raghuram Rajan On Indias Economic Future

Raghuram Rajan: ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఉండొద్దు..

Published Date :December 16, 2023 , 10:52 am
By Chandra Shekhar Pamena
Raghuram Rajan: ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఉండొద్దు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. ఇటీవలి కాలంలో అందరినీ భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తోంది అని ఆయన తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్ దూసుకుపోతుందన్నారు. ఇక, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానికలలు కన్నారు.. ఈ కలను సాకారం చేసేందుకు ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.. కానీ, ఈ కల నెరవేరే అవకాశం లేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Read Also: Hyderabad Thief: సీఎం వస్తే నేను లొంగిపోతా.. దొంగ డిమాండ్ కు పోలీసుల రియాక్షన్

ప్రస్తుత వృద్ధి రేటుతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 2500 డాలర్లుగా ఉంది.. మనం ఇదే స్థాయిలో ముందుకు సాగితే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం చాలా కష్టం అవుతుంది.. భారత ఆర్థిక వ్యవస్థలోని కొన్ని భాగాలు అభివృద్ధి చెందిన దేశాలలా ఉన్నాయన్నారు. అయితే, 2016 డీమోనిటైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నపై రఘురామ్ రాజన్ స్పందిస్తూ.. డీమోనిటైజేషన్ ప్లాన్ పని చేస్తుందా లేదా అని ప్రధాని కార్యాలయం తనను అడిగింది.. దీనిపై, నేను నా బృందం ఈ నిర్ణయంలోని మంచి, చెడులను చెప్పాము అని రాజన్ తెలిపారు.

Read Also: High-Speed Flying-Wing UAV: భారత్ హై-స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యూఏవీ టెస్టింగ్ సక్సెస్

అయితే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరం నాటికి అంటే 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం చాలా కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం, $3.7 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.. అదే టైంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ భారతదేశ నామమాత్రపు జీడీపీ వచ్చే 7 సంవత్సరాలలో 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని విశ్వసిస్తోంది అని రాజన్ చెప్పారు. అలాంటి పరిస్థితిలో 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది అనే నమ్మకంతో ప్రధాని మోడీ సర్కార్ ఉంది.. కానీ, భారతదేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని ఆయన తెలిపారు.. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Former RBI Governor
  • India's Economic
  • latest news
  • PM Modi
  • raghuram rajan

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions