Ram Nath Kovind: “వన్ నేషన్ వన్ ఎలక్షన్” రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?
- వన్ నేషన్ వన్ ఎలక్షన్" రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?
- .. 1967 వరకు ఎన్నికలు ఎలా జరిగాయి?
- గుర్తు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన అని ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ శనివారం అన్నారు. కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అమలుకు ‘అమలు కమిటీ’ వివిధ రాజ్యాంగ సవరణలను పరిశీలిస్తుందని, ఆ తర్వాత పార్లమెంటు తుది నిర్ణయం తీసుకుంటుందని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1967 వరకు మొదటి నాలుగు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయని, అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ఎలా అంటారని ప్రశ్నించారు.
READ MORE: Mohamed Muizzu: భారత్తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని కొన్ని వర్గాలు చెబుతున్నాయని, అయితే రాజ్యాంగ నిర్మాతలకు కూడా అదే ఆలోచన ఉన్నందున ఇది నిజం కాదని మాజీ రాష్ట్రపతి అన్నారు. ఎన్నికల కమిషన్తో సహా అనేక సంస్థలు గతంలో ఈ భావనకు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. వాస్తవానికి మూడు స్థాయిల ప్రభుత్వాలు ఐదేళ్లపాటు కలిసి పనిచేస్తాయని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరలిజాన్ని మరింత బలోపేతం చేస్తుందని రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.
READ MORE: Low Blood Pressure: “బీపీ” అకస్మాత్తుగా తగ్గడానికి గల కారణాలు?
మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ.. 18 626 పేజీల నివేదిక..
ఇదిలా ఉండగా.. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటీవల సమావేశమై తన నివేదికను సమర్పించింది. ఈ 18,626 పేజీల నివేదికను తయారు చేసేందుకు కమిటీ ఈ బిల్లుపై కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను సమర్పించగా, వాటిలో 32 ఏకకాల ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు హెచ్ఎల్సితో విస్తృతంగా చర్చించాయి. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని వార్తాపత్రికలలో ప్రచురించబడిన పబ్లిక్ నోటీసుకు ప్రతిస్పందనగా, భారతదేశం నలుమూలల నుంచి 21,558 మంది పౌరులు స్పందించారు. ప్రతివాదులు 80 శాతం మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టులకు చెందిన పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఎనిమిది మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ ఛైర్మన్ వంటి న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా కోరింది.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..