Mohamed Muizzu: భారత్తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..
- ఇండియాకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ..
- ఈ ఏడాదిలో రెండోసారి పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.
న్యూఢిల్లీ చేరుకున్న ముయిజ్జూకి కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కిరిటీ వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్వు అదికారిక ఆహ్వానం మేరకు ముయిజ్జూ అక్టోబర్ 6-10 మధ్య భారత్లో పర్యటించనున్నారు. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సందర్భంగా, ముయిజ్జూ మాట్లాడుతూ.. తాను వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఉన్నాయని ప్రశంసించారు. అంతకుముందు, జూన్ నెలలో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ ఏడాదిలో భారత్ని సందర్శించడం ఇది రెండోసారి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: West Bengal: బెంగాల్లో మరో రేప్ కేసు.. పొరుగింటి మహిళపై అత్యాచారం, విషమిచ్చి హత్య..
నిజానికి కొత్తగా ఎన్నికైన ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా ముందుగా భారత పర్యటకు వచ్చేవాడు. అయితే, ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చిన మహ్మద్ ముయిజ్జూ.. తన తొలి పర్యటనని చైనాలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత టర్కీ వెళ్లాడు. ఇప్పుడు ఇండియాకు వచ్చాడు. దీంతో పాటు ఈ ఏడాది ప్రధాని లక్షదీవుల పర్యటనకు వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు మోడీనిపై అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో ఇండియా ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. బాయ్ కాట్ మాల్దీవిస్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీని తర్వాత మాల్దీవుల్లో పర్యాటక రంగం పడిపోయింది. ఆ తర్వాత విషయం అర్థమైన మాల్దీవులు, ఇండియాతో మళ్లీ స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ముయిజ్జూ పర్యటన సాగబోతోంది.
Official Spokesperson, Ministry of External Affairs, Randhir Jaiswal tweets, "A warm welcome to President Mohammed Muizzu of Maldives as he arrives in New Delhi on a State Visit to India. Received by MoS KV Singh at the airport. The visit will provide further boost to this… pic.twitter.com/lUASS3YS1y
— ANI (@ANI) October 6, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!