Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో షాక్.. తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Pakistan PM Imran Khan get 14 year jail in Toshakhana Case: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు మరో షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడగా.. తాజాగా తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోజు వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్కు రెండు కేసులలో జైలు శిక్ష పడడం విశేషం. తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీకి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫిబ్రవరి 8 పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. పాక్ మాజీ ప్రధానికి వరుసగా శిక్షలు పడుతున్నాయి.
తోషఖానా కేసుకు సంబందించి అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో విచారణ చేపట్టారు. దోషులుగా తేలడంతో ఇమ్రాన్ మరియు అతని భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఈ ఇద్దరు 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించకుండా నిషేధించారు. అంతేకాదు ఒక్కొక్కరికి 787 మిలియన్ల జరిమానా కూడా విధించారు. అయితే బుష్రా బీబీ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడం గమనార్హం.
Also Read
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
Also Read: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదు అయింది. ఉన్నత పదవుల్లో ఉండే పాకిస్తాన్ ప్రముఖులు విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన అనంతరం వాటిని తోషఖానాకు అప్పగించాలి. లేదా సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి కొన్నింటిని సొంతం చేసుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాలో జమ చేయకుండానే విదేశాల్లోనే అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి ఇమ్రాన్ సొంతం చేసుకున్నారట. విచారణలో ఇమ్రాన్ సహా అతడి సతీమణి దోషులుగా తేలారు.
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!