RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్పై 420 కేసు పెట్టాలి.. మాజీ మంత్రి డిమాండ్..
- చంద్రబాబు, పవన్ కల్యాణ్పై 420 కేసు పెట్టాలి..
- ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశానంటూ సిగ్గు లేకుండా అబద్దాలు..
- సంతకం పెట్టి హామీలు అమలు చేయనందుకు కేసు పెట్టాలన్న రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ కల్యాణ్పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. తిరుపతి జిల్లా నిండ్ర మండలంలో రికాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశానంటూ చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.. అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటని వ్యాఖ్యానించిన ఆమె.. సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు..
Read Also: Pakistan-Bangladesh: పాక్-బంగ్లా అధికారులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. భారత్పై ప్రభావం..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
నిరుద్యోగులను, పిల్లలు సహా అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఆర్కే రోజా.. సిగ్గు లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీ అమ్మేయాలని అంటున్నాడు అని మండిపడ్డారు.. ప్రతి నెల 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు… రెండు కోట్ల మందికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు.. హామీ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా..? అని నిలదీశారు.. కేవలం అధికారం కోసమే హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.. ఇలాంటి వారికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడాలి… కానీ, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు రోజా.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రీ బస్సు అంటూ మోసం చేశారని మండిపడ్డారు.
Read Also: Bihar: స్కూల్లో “నాగమణి”ని వదిలి వెళ్ళిన తాచు పాము..? అలాంటి మణి నిజంగా ఉందా..?
మరోవైపు, శ్రీశైలం మాజీ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి పెద్ద వెన్నుపోటుదారుడు అని ఫైర్ అయ్యారు రోజా.. నిండ్ర మండలంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు… సొంత చిన్నాన్న మాజీ మంత్రి చెంగారెడ్డికి వెన్నుపోటు పొడిచాడు, తరువాత నా దగ్గర పదవులు, లబ్ధిపొంది నాకు వెన్నుపోటు పొడిచాడు.. కానీ, ఇప్పుడు గాలి భాను ప్రకాష్ వెన్నుపోటు పోడవకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.. నా వల్ల లబ్ధిపొంది నాకే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు పార్టీలో చేరారంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..