Pakistan-Bangladesh: పాక్-బంగ్లా అధికారులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. భారత్పై ప్రభావం..
- పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న సంబంధాలు..
- అధికారుల వీసా ఫ్రీ ఎంట్రీకి ఇరు దేశాల అంగీకారం..
- బంగ్లాలో ఐఎస్ఐ అధికారుల ఉనికి భారత్కి ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Read Also: Thailand-Cambodia: తీవ్రమవుతున్న థాయిలాండ్-కంబోడియా ఘర్షణ.. 16 మంది మృతి..
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
1971 యుద్ధం తర్వాత, పాకిస్తాన్-బంగ్లాదేశ్లు తమ దౌత్య, వాణిజ్య, వ్యాపార సంబంధాలనున పునరుద్ధరించుకుంటున్నాయి. ఈ చర్యల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. బుధవారం ఢాకాలో అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత వీసా ఫ్రీ ఎంట్రీపై నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ రేడియో ప్రకటించింది. అంతర్గత భద్రత, పోలీస్ శిక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరించుకోవాలని అనుకుంటున్నాయి.
ఈ రెండు దేశాల సంబంధాలు భారత్ని ఒక హెచ్చరిక. ఈ రెండు దేశాల సంబంధాల తర్వాత పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన పలువురు ఏజెంట్లు అధికారులు రూపంలో బంగ్లాదేశ్కి వస్తున్నట్లు సమచారం. బంగ్లాదేశ్లో ఐఎస్ఐ ఏజెంట్ల ఉనికి, ఆ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది భారత్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గత నెలల్లో పాక్ ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ ఏజెంట్లు భారత సరిహద్దుల్లోని రంగ్పూర్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ ఏరియాల్లో సంచరించినట్లు నివేదికలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!