Harish Rao: ఎప్పుడో అయిపోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్..
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఎటాక్
- రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా..?- హరీష్ రావు
- మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదు
- ఎప్పుడో అయిపోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ పర్యటన వివరాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80 వేల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చినందుకు ఆయా కంపెనీలకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా అని ప్రశ్నించారు. రైతు భరోసా చిల్లర పంచాయతీనా ముఖ్యమంత్రి గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Health Tips: వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలా? ఈ చిట్కాలు మీకోసమే..
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని విమర్శించారు హరీష్ రావు. మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావని ఆరోపించారు. ఎప్పుడో అయిపోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్ అంటూ దుయ్యబట్టారు. దావోస్లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అంటే.. మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు.. భట్టి విక్రమార్క చెప్పింది నిజమా..? మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి.. అంటూ ప్రశ్నించారు.
Read Also: Beerla Ilaiah: రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడు.. కేటీఆర్పై తీవ్ర విమర్శలు
పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది.. అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని అన్నారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా..? అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నావు.. ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నావు.. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది.. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచావని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నావు.. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టి మీ ప్రచారం వినాలా? అంటూ దుయ్యబట్టారు. రైతుల అప్పులు ముఖ్యమా.? దావోస్ డప్పులు ముఖ్యమా..? అంటూ విమర్శించారు. మీ సెల్ఫ్ డబ్బాకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది.. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది.. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది.. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!