Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో.. లేదో!
- 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నారు
- అక్కడ ఉన్నవాళ్లలో ఎక్కువ మంది టీడీపీ పంపిన వాళ్ళే
- మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది
- వాళ్ళు మీ వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి
- వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు
పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని.. ఆ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో.. లేదో అంటూ విమర్శించారు. “ఒక్క మాట చెప్పారు.. నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం.. అన్నారు.. చంద్రబాబు ఓ బీ టీంగా జనసేనను వదిలారు.. పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు.. 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నారు.. అక్కడ ఉన్నవాళ్లలో ఎక్కువ మంది టీడీపీ పంపిన వాళ్ళే…మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది.. వాళ్ళు మీ వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి.. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటారు.. నాకు రాజకీయాల్లోకి వచ్చి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను అని చెప్పారు.. ఆయనకేమైనా డబ్బులు లేవా.. ఆరోగ్యం ఎందుకు పాడైంది..” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఒకసారి మా ఇంట్లో రామ నామ స్మరణ ఉంటుందని చెప్పారని.. ఆయనకు గుర్తుందో లేదో గతంలో మా నాన్న హేతువాది అని ఓసారి చెప్పారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. హామీల సంగతి ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వైసీపీని ధీటుగా ఎదుర్కొంటాం.. మేం అధికారంలోకి వస్తాం అని మాట్లాడారా? అని విమర్శించారు.. ఉత్తరాది వారి అహంకారం అని మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు వారికీ సహకారిగా మారారన్నారు.. ఆయన సిద్ధాంతం ఏంటో.. ఎక్కడ మొదలై.. ఎక్కడకు వెళ్తున్నారో ఆయనకే తెలియదని చెప్పారు.. “జయకేతనం అని సభ పెట్టీ.. మీరు మాట్లాడింది ఏంటి.. ఊసరవెళ్లి లాగా మారిపోతున్నారు.. మెడికల్ కళాశాలలు మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించాలని చూస్తున్నారు.. అసలు జనసేన శాసనసభకు దోపిడీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారు.. ఆయనకు ప్రియమైన మంత్రి పనే కలెక్షన్ చేయటం.. సీజ్ ది షిప్ అన్నారు.. సముద్రంలోకి వెళ్ళారు.. వచ్చారు.. ఏం సాధించారు.. ఒకసారి టీడీపీకి సపోర్ట్ చేస్తారు.. మరోసారి జత కడతారు.. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు.. నాలుగు భాషల్లో మాట్లాడిన పవన్ ఉత్తరాదికి అనుకూలమైన దక్షిణాది నాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. వారసత్వ రాజకీయాలు ఏంటి అని ప్రశ్నిస్తారు.. కానీ సీటు ఖాళీ అయితే తన అన్నకు ఇస్తారు..” అని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!