Maharashtra Elections: అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి.. కానీ..
- మహారాష్ట్ర ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి
- గతంలో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన దిలీప్ ఖేద్కర్
- నామినేషన్ పత్రాల్లో భార్య వివరాలు ప్రస్తావించని వైనం
- గత లోక్సభ ఎన్నికల్లో పూర్తి వివరాలు వెల్లడించిన దిలీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దిలీప్ ఖేద్కర్ గతంలో అహ్మద్నగర్ స్థానం నుంచి వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి దిలీప్, ఆయన భార్య మనోరమ ఖేద్కర్ కూడా క్రిమినల్ బెదిరింపు కేసులో నిందితులుగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల అఫిడవిట్లో తన భార్యకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రస్తావించలేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన తన భార్య మనోరమ ఖేద్కర్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
READ MORE: Odisha: గర్భిణీ ఉద్యోగికి సెలవు నిరాకరణ.. బిడ్డ కోల్పోయిన మహిళ..
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
భార్య మనోరమ ఖేద్కర్పై ఈ కేసు….
భూ వివాదంపై జూన్ 2023లో పూణె జిల్లాలో ఓ రైతుకు తుపాకీ చూపించారని ఆయన భార్య మనోరమ ఖేద్కర్పై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీని తర్వాత జూలైలో పుణెలోని సెషన్స్ కోర్టు ఈ కేసులో దిలీప్ ఖేడ్కర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు ఆయన కూతురు పూజా ఖేద్కర్పై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లోని ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతి) ‘నాన్-క్రీమీ లేయర్’ రిజర్వేషన్ను తన తల్లిదండ్రులు వేరు చేశారని క్లెయిమ్ చేయడం ద్వారా పూజా ఖేద్కర్ తప్పుగా పొందారని ఆరోపించారు. ఈ దావా ఆధారంగా.. ఆయన ఓబీసీ, వికలాంగుల కోటాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఐఏఎస్లో తన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆరోపణల మధ్య గుర్తింపు రద్దు చేయబడింది. అయితే, 6 సెప్టెంబర్ 2024 నాటి ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ రూల్స్.. 1954 ప్రకారం ఆమెను తొలగించింది. ఇంకా.. యూపీఎస్సీ కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేసింది. ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్తో ఈ వివాదం తెరకెక్కింది.
READ MORE:Nadendla Manohar: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!