Maharashtra Elections: అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి.. కానీ..
- మహారాష్ట్ర ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి
- గతంలో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన దిలీప్ ఖేద్కర్
- నామినేషన్ పత్రాల్లో భార్య వివరాలు ప్రస్తావించని వైనం
- గత లోక్సభ ఎన్నికల్లో పూర్తి వివరాలు వెల్లడించిన దిలీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దిలీప్ ఖేద్కర్ గతంలో అహ్మద్నగర్ స్థానం నుంచి వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి దిలీప్, ఆయన భార్య మనోరమ ఖేద్కర్ కూడా క్రిమినల్ బెదిరింపు కేసులో నిందితులుగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల అఫిడవిట్లో తన భార్యకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రస్తావించలేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన తన భార్య మనోరమ ఖేద్కర్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
READ MORE: Odisha: గర్భిణీ ఉద్యోగికి సెలవు నిరాకరణ.. బిడ్డ కోల్పోయిన మహిళ..
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
భార్య మనోరమ ఖేద్కర్పై ఈ కేసు….
భూ వివాదంపై జూన్ 2023లో పూణె జిల్లాలో ఓ రైతుకు తుపాకీ చూపించారని ఆయన భార్య మనోరమ ఖేద్కర్పై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీని తర్వాత జూలైలో పుణెలోని సెషన్స్ కోర్టు ఈ కేసులో దిలీప్ ఖేడ్కర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు ఆయన కూతురు పూజా ఖేద్కర్పై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లోని ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతి) ‘నాన్-క్రీమీ లేయర్’ రిజర్వేషన్ను తన తల్లిదండ్రులు వేరు చేశారని క్లెయిమ్ చేయడం ద్వారా పూజా ఖేద్కర్ తప్పుగా పొందారని ఆరోపించారు. ఈ దావా ఆధారంగా.. ఆయన ఓబీసీ, వికలాంగుల కోటాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఐఏఎస్లో తన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆరోపణల మధ్య గుర్తింపు రద్దు చేయబడింది. అయితే, 6 సెప్టెంబర్ 2024 నాటి ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ రూల్స్.. 1954 ప్రకారం ఆమెను తొలగించింది. ఇంకా.. యూపీఎస్సీ కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేసింది. ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్తో ఈ వివాదం తెరకెక్కింది.
READ MORE:Nadendla Manohar: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..