NTV Telugu Site icon

Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..

Tamilisai

Tamilisai

తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం ఇచ్చారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపారు.

Read Also: PM Modi: తమిళనాడు టూర్‌లో బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం

నేను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. తెలంగాణ ప్రజలు నన్ను వారి అక్కగా ఆదరించారు. మీ అచంచలమైన మద్దతు, ప్రేమ మరియు ఆప్యాయత ఎంతగా నాహృదయాన్ని తాకాయో నేను మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నాను. మీతో పంచుకున్న ప్రతి క్షణం నాపై చెరగని ముద్ర వేసింది. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి ప్రగతికి పాటు పడ్డాము. బోనాలు, బతుకమ్మ తదితర పండుగలు జరుపుకున్నాం. మీ అచంచలమైన మద్దతు, సహృదయత నాకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

Read Also: Thatikonda Rajaiah: సీఎం రేవంత్, డీకే శివ కుమార్ను కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..

నేను గవర్నర్ పదవికి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా.. మీలో ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అచంచల మద్దతుకు మరియు నన్ను మీ స్వంత అక్కగా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల నా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది. మన అద్భుతమైన ప్రయాణం, చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో నేను తెలంగాణ వీడుతున్నాను. కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక నమస్కారాలతో డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అని తెలిపారు.