Jammu Kashmir: జమ్ములో కాంగ్రెస్ తో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు! బీజేపీ పరిస్థితేంటి?
- జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన
- కాంగ్రెస్ తో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు
- సాయంత్రంలోగా పొత్తుపై అధికారిక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. సాయంత్రంలోగా పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆగస్టు 20 నుంచి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఓటింగ్కు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీగా నిర్ణయించారు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇందులో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్లో 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో 16 సీట్లు కాశ్మీర్ లోయ నుంచి, 8 సీట్లు జమ్మూ ప్రాంతం నుంచి ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించవచ్చు. 90 స్థానాలకు మూడు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి.
READ MORE: PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు..
2014 తర్వాత జమ్మూకశ్మీర్లో ఇదే తొలి అసెంబ్లీ ఎన్నికలు. 2014లో రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు ఓట్లు పోలయ్యాయి. అప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి అవసరమైన 44 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీ కూడా చేరుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉన్న పార్టీలైన పీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
READ MORE:E-SHRAM: కార్మికుల కష్టానికి “ఈ-శ్రమ్” సాయం.. ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. వెయ్యి!
బీజేపీ ముందున్న సవాళ్లు ఏమిటి?
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం… జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ముందు ఉన్న పెద్ద సవాలు స్థానిక పార్టీలు, కాంగ్రెస్. జమ్మూ డివిజన్లో బీజేపీని 20 సీట్లకు తగ్గించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. తద్వారా అసెంబ్లీలో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వంలో ఏర్పాటు చేయవచ్చని పావులు కదుపుతోంది. స్థానికంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు కనిపించాయి. గత నెలలో బీజేపీ పరిస్థితి మరింత మారిపోయింది. పలువురు స్థానిక నాయకులు పార్టీని వీడినట్లు సమాచారం. జమ్మూ డివిజన్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ కల. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!