Surveillance Vulture: సరిహద్దులో “నిఘా రాబందు”.. కాళ్లకు జీపీఎస్, మైక్రో కెమెరా..
- ఇది "నిఘా రాబందు"
- కాళ్లకు జీపీఎస్.. మైక్రో కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ రాబందు.. చూడటానికి సాధారణంగానే ఉంది. కానీ.. దాని కాళ్లకు మాత్రం జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరా అమర్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. బాగా అలసిపోయింది ఆ రాబందు. కొందరు దాన్ని గమనించి చికెన్ తో పాటు, నీళ్లు అందించారు. ఎంచక్కా తిన్న తర్వాత ఆ రాబందు సేదతీరింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఆ రాబందు కాళ్లకు అమర్చిన పరికరాల ఆధారంగా దానిపై ప్రస్తుతం సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: Varahi Declaration: సనాతన ధర్మం డిక్లరేషన్ ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం.. కీలక అంశాలు ఇవే..!
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఈ రాబందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో లభించినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల క్రితం చర్లలో సంచరించిన రాబందు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన రాబందు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. తిరిగి తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడంతో స్థానికులు గమనించి కోడి మాంసాన్ని తీసుకువచ్చి వేశారు. దీంతో కోడి మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది.
READ MORE:Viral Video: ట్రాఫిక్ జామ్లో చిక్కుక్కున్న అమ్మాయి.. ఏం చేసిందో చూడండి
అక్కడ ఉన్న స్థానికులు దాని ఫొటోలను వీడియోలు తీశారు. దాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇది కేంద్ర బలగాలు ప్రవేశపెట్టిన అస్త్రంగా పేర్కొన్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ మైన్ల కారణంగా భారీగా నష్టపోయిన సీఆర్పీఎఫ్ బలగాలు.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల ట్రాప్లో పడకుండా వారి ఆచూకీ కోసం సరికొత్త పంథా అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఓ వైపు డ్రోన్లు, మరోపై ఇలా పక్షుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అడవుల్లోని అణువనువూ వెతుకుతున్నారు. ఇలా పక్షి రూపంలో ఉంటే నక్సలైట్ల అనుమానం రాదని నిఘా వార్గాలు భావించాయి. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!