Air Pollution: వాయు కాలుష్యం బారినపడకుండా ఉండటానికి ఈ సలహాలు పాటించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం పీల్చే గాలి రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. పొగమంచు మరియు గాలి నాణ్యత స్థాయిలు తగ్గిపోవడం ఇప్పుడు కాలానుగుణంగా మనం ప్రతి సంవత్సరం పోరాడుతున్న సమస్యగా మారినప్పటికీ, AQI స్థాయిలు ఈసారి చాలా భయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో AQI 600 కంటే ఎక్కువగా ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. PM స్థాయి 700 కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దు అని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటే ఇంటినుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. అయితే ప్రజలు పని కోసం ఇళ్లను బయటికొచ్చినప్పుడు గాలి కాలుష్యం బారిన పడకుండా కొన్ని సలహాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Read Also: YCP vs Janasena: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత
Also Read
వ్యాయామం చేయవద్దు.
నడవవద్దు.
ఆస్తమా సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి వారి మోతాదును పెంచుకోవాలి.
మూతికి కట్చిఫ్ కట్టుకోవాలి.
బయటి ఆహారపదార్థాలను తినడం మానుకోవాలి.
కలుషిత నీరు తాగవద్దు.
ధూమపానం చేయొద్దు.
కారు, బైక్ కాలుష్యాన్ని చెక్ చేసుకోవాలి.
మీ ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి
ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉంచాలి.
ఇంటి బయట మాత్రమే బూట్లు తీయండి.
ఎయిర్ ఫ్రెషనర్లను తక్కువగా వాడండి.
ప్రతి వారం బెడ్షీట్లను వేడి నీటిలో కడగాలి.
ఇంటి చుట్టూ వీలైనన్ని మొక్కలు నాటండి.
Read Also: Dharmana Krishna Das: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగనే
ఇదిలా ఉంటే.. వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి అనేక రకాల పరిశోధనలు వెలువడ్డాయి. వాటి గురించి తెలుసుకుందాం….
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల జీవితకాలం తగ్గవచ్చు
వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు ముందుగానే చనిపోతారని ఒక పరిశోధన వెల్లడించింది.
రుమాలు లేదా కండువాతో కాలుష్యం నుండి రక్షించుకోండి
మీ ముఖాన్ని రుమాలు లేదా స్కార్ఫ్తో కప్పుకోవడం ద్వారా కాలుష్యం నుండి పూర్తిగా రక్షించదని మరో పరిశోధన చెబుతోంది.
పిల్లలు ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు
ఒక పరిశోధన ప్రకారం.. కాలుష్యం కారణంగా పిల్లలు, యుక్తవయస్కులు ఆర్థరైటిస్ లేదా సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. ఇందులో నొప్పి, వాపు, లూపస్ మొదలైనవి ఉండవచ్చు. లూపస్ వ్యాధి వాయు కాలుష్యం వల్ల వస్తుంది. దీంతో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, గుండె క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. బాల్యంలో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలను కూడా పెంచుతుందని పరిశోధనలో తేలింది.
కాలుష్యం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధి
కిడ్నీ ఫెయిల్యూర్కు ప్రధాన కారణమైన కిడ్నీ వ్యాధికి వాయుకాలుష్యం కారణమని మరో అధ్యయనంలో వెల్లడైంది.
గుండెపోటు
ఒక పరిశోధన ప్రకారం.. కాలుష్యం గుండెపోటుకు కారణమయ్యే అథెరోస్క్లెరోసిస్ (ధమనుల గట్టిపడటం) ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు.. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించాలి.
ప్రీమెచ్యూర్ డెలివరీ భయం
ఆస్తమా ఉన్న గర్భిణీ స్త్రీలు వాయు కాలుష్యం కారణంగా నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!