Flood fear in Delhi: యమున ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood fear in Delhi as Yamuna crosses 207-metre mark: ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది. బుధవారం తెల్లవారుజామున ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాజధానిలో వరదల భయాన్ని ప్రేరేపించింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఉద్దేశించిన బెంచీలు కూడా నీట మునిగాయి.
Also Read: Kedarnath Yatra: భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం, యమునా నది అత్యధిక రికార్డుకు చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్ల నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. “వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం పెరుగుతోంది. నది ఒడ్డున ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేశాం. ఇతర సంస్థలతో కూడా సమన్వయం ఏర్పాటు చేశాం.దీని వల్ల బాధితులను వెంటనే ఆ ప్రాంతాల నుంచి తక్షణమే ఖాళీ చేయించవచ్చు” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం రాత్రి 8 గంటల సమయానికి 206.76 మీటర్లకు పెరిగింది, ఇది 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిన తర్వాత ఇదే అత్యధికం అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా సంతృప్త మట్టి కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులో యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. యమునా నది చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ పశువులను ఢిల్లీలోని సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను ఎత్తైన ప్రదేశాలలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం మంగళవారం సాయంత్రం తెలిపింది. అవగాహన, తరలింపు, రెస్క్యూ పనుల కోసం 45 బోట్లను మోహరించినట్లు, ఖాళీ చేయబడిన ప్రజలకు సహాయం అందించడానికి ఎన్జీవోలను నియమించామని అధికారులు చెప్పారు.
Also Read: Poverty: భారత్లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో బుధవారం ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. దేశ రాజధానిలో మరిన్ని వర్షాలు కురిస్తే యమునాలో నీటి మట్టం మరింత ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది. ఇది అధికారులకు పెద్ద సవాలుగా మారింది.గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 34, 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో శని, ఆదివారాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల మధ్య 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు గుంతలు పడి నివాస సముదాయాల్లోకి నీరు చేరింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులు నీటమునిగిన రోడ్లు మరియు ట్రాఫిక్ జామ్లతో నావిగేట్ చేయాల్సి వచ్చింది.
అటు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉత్తరాఖండ్ లో వరద ఉద్ధృతికి మరో నలుగురు మరణించారు. మొత్తమ్మీద ఉత్తరాదిన ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మరణించినవారి సంఖ్య 43కి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేర్ తాల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల నుంచి 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో వారిని కురుక్షేత్ర ప్రాంతానికి తరలించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!