Poverty: భారత్లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poverty: దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(UNDP), ఆక్స్ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్(OPHI)లు కలిసి ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’(MPI) వెల్లడించాయి. భారత్ తో సహా చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో కలిపి 25 దేశాలు పేదరికాన్ని సగానికి తగ్గించుకున్నాయని నివేదిక తెలిపింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే (2005-06- 2019-2021)లో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయినట్లు నివేదికి పేర్కొంది. 2005-06లో దేశంలో దాదాపుగా 64.5 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకి, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా MPIని రూపొందించారు.
Also Read
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
Read Also: GST Council: ఆన్లైన్ గేమింగ్పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
ఇదిలా ఉంటే ఎంపీఐ గణాంకాల ప్రకారం..110 దేశాల్లోని 6410 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. వీరిలో 84 శాతం మంది గ్రామీణులే ఉన్నారు. 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది 18 ఏళ్లలోపు వారే. మొత్తం పేదల్లో సబ్ సహారా ఆఫ్రికాలోనే 53.4 కోట్ల మంది, దక్షిణాసియాలో 38.9 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ ఆరుగురిలో పేదల్లో దాదాపుగా ఐదుగురు ఈ ప్రాంతాల వారే ఉన్నారు. మూడింట రెండొంతుల మంది పేదలు మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నాట్లు నివేదిక వెల్లడించింది. ఈ దేశాల్లో పేదరికాన్ని అంతమొందించాలంటే అనేక చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయితే పేదరికం తగ్గుదలపై కరోనా పరిస్థితులను కూడా అంచనా వేయాల్ని ఉందని తెలిపింది.
భారతదేశంలో వివిధ సూచికల్లో పేదల తగ్గుదల ఇలా ఉంది.(2005-06 నుంచి 2019-21 వరకు)
*పోషకాహర లేమి – 44.3 శాతం నుంచి 11.8 శాతానికి
* వంట ఇంధనం- 52.9 శాతం నుంచి 13.9 శాతానికి
*పారిశుద్ధ్యం- 50.4 శాతం నుంచి 11.3 శాతానికి
* తాగు నీరు-16.4 శాతం నుంచి 2.7 శాతానికి
*గృహనిర్మాణం- 44.9 శాతం నుంచి 13.6 శాతానికి
*శిశుమరణాలు -4.5 శాతం నుంచి 1.5 శాతానికి
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!